ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 8 మంది టీడీపీ నేతలను చంపేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరులో ఈరోజు పర్యటించిన చంద్రబాబు.. వైసీపీ నేత దొన్నుదొరను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..టీడీపీ నేతలపై కావాలనే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని విమర్శించారు. టీడీపీ నేత యరపతినేని శ్రీనివాస్ అక్రమ మైనింగ్ కేసు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయనకు అండగా నిలవాలని టీడీపీ అధిష్ఠానం నిర్ణయించింది.
తెలుగుదేశం వల్లే తమకు న్యాయం జరుగుతుందని ఏపీ ప్రజలు అనుకుంటున్నారని అన్నారు . ఏపీలో సిమెంట్ బస్తా ధర కంటే ఇసుక బస్తా ధర అధికంగా ఉందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీపై నమ్మకంతోనే సియ్యారి దొన్నుదొర పార్టీలో చేరారని వ్యాఖ్యానించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ఘనత తమదేనని చంద్రబాబు పేర్కొన్నారు.
జేడీఎస్తో పొత్తుతో నష్టపోయాం..లేకుంటే 16 స్థానాల్లో గెలిచేవాళ్లం: వీరప్ప మొయిలీ