పండుగ వేళ భవన నిర్మాణ రంగ మేస్త్రీలు బ్రహ్మాజీ, వెంకట్రావుల ఆత్మహత్యలు తనను కలచివేశాయని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులకు ఉపాధిని దూరం చేయడమే కాకుండా వారి ప్రాణాలను కూడా హరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కొరతతో కార్మికులు పనుల్లేక ఆత్మహత్యలు చేసుకుంటుండడం ఎంతో బాధిస్తోందని అన్నారు.
సమస్యలకు ఎదురొడ్డి పోరాడేలా తప్ప ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని హితవు పలికారు. బ్రహ్మాజీ, వెంకట్రావుల్లా మరెవరూ తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. కార్మికులకు టీడీపీ అండగా ఉంటుందని, కార్మికుల కోసం తానున్నానని స్పష్టం చేశారు. వైసీపీ సర్కారు మాత్రం తమ పార్టీ నేతల జేబులు నింపడమే లక్ష్యంగా పనిచేస్తోందని మండిపడ్డారు.
ప్రొసీజర్ ఫాలో అయితే జగన్ ప్రశ్నిస్తున్నారు: యనమల