telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుపతి ఉప ఎన్నికలోకి వైసీపీ వాలంటీర్లు…

ప్రస్తుతంలో ఏపీలో తిరుపతి ఉప ఎన్నికల జోరు నడుస్తుంది. అయితే రేపు జరగనున్న ఈ ఉప ఎన్నిక కోసం ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది.  ఓటర్లను ప్రభవింత కాకుండా చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ.  తిరుపతి ఉప ఎన్నికపై టీడీపీ నేత సోమిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.  తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ వాలంటీర్లను రంగంలోకి దింపారని, ఒక్కో వాలంటీర్ కు రూ. 5వేలు ఇచ్చి పోలింగ్ కథ నడుపుతున్నారని అన్నారు.  తిరుపతి లోక్ సభ పరిధిలోని వాలంటీర్లకు రూ. 11 కోట్లు చేరవేశారని అన్నారు.  ఎన్నికల సంఘం నిస్తేజంగా ఉండటం సరికాదని సోమిరెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తిరుపతి ఉప ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.  వైసీపీ, టీడీపీ, బీజేపీలు ఈ ఉప ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలతో సమానంగా ప్రచారం నిర్వహించాయి. విమర్శల దాడిని రోజు రోజుకు పెంచాయి. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరి విజయం సాధిస్తారు అనేది.

Related posts