telugu navyamedia
రాజకీయ వార్తలు

దేశం విడిచి వెళ్లకుండా.. చిదంబరానికి లుకౌట్ నోటీసులు

congress chidambaram

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. చిదంబరానికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఆయన ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో చిదంబరం దేశం విడిచిపారిపోకుండా ఎన్ ఫోర్స్ మెట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు లుకౌట్ నోటీసులు జారీచేశారు.

ఈ నోటీసులు జారీచేస్తే సంబంధిత వ్యక్తులు విదేశాలకు వెళ్లకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణానికి సంబంధించి చిదంబరంపై అవినీతి, నగదు అక్రమ చలామణీ కేసులు నమోదయ్యాయి. 2007లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో చిదంబరం నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్ఎక్స్ మీడియాలో విదేశీ పెట్టుబడులకు అనుమతించారనీ, ఇందుకు ప్రతిఫలంగా ముడుపులు అందుకున్నారని సీబీఐ, ఈడీ ఆరోపిస్తున్నాయి.

Related posts