telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు జగన్ లేఖ

YS Jagan Write letter to KCR

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని లేఖలో ప్రస్థావించారు.

అంతర్రాష్ట్ర బదిలీలను సత్వరమే పూర్తి చేయాలని, మానవతా దృక్పథంతో ఆలోచించి బదిలీలు చేపట్టాలని విన్నవించారు. పరస్పర బదిలీలపై కమిటీ సవరణ ఉత్తర్వులు విడుదల చేయాలని, అవి వెలువడిన తర్వాత ఉద్యోగుల బదిలీలు జరపాలని జగన్ విజ్ఞప్తి చేశారు.

Related posts