telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన డొక్కా

dokka joined ycp

తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇటీవల తన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో ఆయన చేరారు.

జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డొక్కాను జగన్ అభినందించారు. అనంతరం ఆయన మీడియాతోమాట్లాడుతూ సీఎం జగన్ అభివృద్ధి పనుల్లో భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే పార్టీలో చేరానని చెప్పారు.

Related posts