తెలుగుదేశం పార్టీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఇటీవల తన టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో ఆయన చేరారు.
జగన్ ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డొక్కాను జగన్ అభినందించారు. అనంతరం ఆయన మీడియాతోమాట్లాడుతూ సీఎం జగన్ అభివృద్ధి పనుల్లో భాగస్వామిని అవుతానని పేర్కొన్నారు. ఆ ఉద్దేశంతోనే పార్టీలో చేరానని చెప్పారు.