హైదరాబాద్ నగరంలోని కృష్ణకాంత్ పార్క్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సాయిబాబా ఆలయం సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు వెంకటగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆర్టీసీ బస్సులు నిర్లక్ష్యంగా నడపడం వల్లే తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ అమాయకులు చనిపోతున్నారని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
previous post