telugu navyamedia
క్రైమ్ వార్తలు

స్నేహితుల కోసం వెళ్లిన వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి..

మహబూబ్‌నగర్ ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది..మరికొంది గంటల్లో పెళ్లి పీట‌లు ఎక్క‌బోయే వ‌రుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెంద‌డంతో విషాదం చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెళితే..

మహబూబ్‌నగర్ పట్టణంలోని క్రిస్టియన్‌పల్లిలో నివాసముండే చైతన్య.. నారాయణపేట జిల్లా తిరుమలాపూర్ గ్రామ ప్రైమరీ స్కూల్ ఉపాద్యాయుడుగా పనిచేస్తున్నాడు.

అతడికి గురువారం ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉంది. కాగా, తన పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన స్నేహితులను రిసీవ్ చేసుకునేందుకు జడ్చర్లకు స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాడు.

జడ్చర్ల మండలం నక్కల బండ తండా వద్ద కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో చైతన్య అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో పెళ్లింట విషాదం ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పెళ్లి బాజాలు మోగాల్సి ఆ ఇంటిలో రోదనలు మిన్నంటాయి.

Related posts