టాలీవుడ్ టాప్ కమెడియన్ కు వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే సీఎం జగన్ ఆలీని రాజ్యసభకు పంపే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం అందుతుంది.
2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ కోసం పనిచేసిన ఆలీకి సీఎం జగన్ రాజ్యసభ పదవి ఇచ్చే అవకాశం ఇవ్వనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నేడు సీఎం జగన్తో జరిగిన సినీ ప్రముఖుల భేటీలో ఆలీ కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అందరి సమక్షంలోనే ‘నీకో శుభవార్త చెబుతాను.. మరో వారంలో కలుద్దాం’ అని సీఎం జగన్.. ఆలీతో చెప్పినట్టుగా తెలుస్తోంది. రాజ్యసభ సీటు విషయం చర్చించేందుకు సీఎం జగన్.. ఆలీని కలవాలని సూచించినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతకాలంగా రాజ్యసభ స్థానాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏపీ కోటాలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్న నేపథ్యంలో ఆ నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలోకే చేరనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి రాజ్యసభ ఛాన్స్ ఎవరికి వస్తుందనే దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
నాలుగు స్థానాల్లో ఒకటి ప్రస్తుతం ఎంపీగా ఉన్న వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డికి దాదాపు ఖాయమైంది. .దీంతో మిగిలిన మూడు స్థానాల్లో ఒక సీటు మైనారిటీ వర్గాలకు వారికి ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హాస్యనటుడు ఆలీకి రాజ్యసభ సీటు దక్కుబతోనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఎన్నికల ముందు వైసీపీ కండువా కప్పుకున్న ఆలీ.. పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న ఆలీకి ఎటువంటి పదవి దక్కలేదు. గతంలో కూడా పలుమార్లు ఆలీకి ఏదో ఒక పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఈ సారైనా పదవి దక్కుతుందో లేదో చూడాలి..
అందుకే సీఎం జగన్ పై పవన్ వ్యాఖ్యలు: మంత్రి వెల్లంపల్లి