telugu navyamedia
క్రైమ్ వార్తలు

తిరుప‌తిలో సాప్ట్ వేర్ ఇంజ‌నీర్ ఘాత‌కం..భార్య‌ను హ‌త్య చేసిన‌ చెరువులో ప‌డేసిన భ‌ర్త

*తిరుప‌తిలో సాప్ట్ వేర్ ఇంజ‌నీర్ ఘాత‌కం.
*భార్య‌ను హ‌త్య చేసిన‌ చెరువులో ప‌డేసిన భ‌ర్త వేణుగోపాల్ వెల్ల‌డి..
*వివాహం జ‌రిగిన‌ప్పుడు నుంచి భార్య‌భ‌ర్త‌ల‌మ‌ధ్య గొడ‌వ‌లు..

తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో భర్త.. భార్యను దారుణంగా హత్య చేసి మృత‌దేహ‌న్ని సూట్ కేసులో పెట్టి చెరువులో పడేసిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వేణుగోపాల్‌కు, తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో కుటుంబ సభ్యులు వివాహం జరిపించారు. వివాహమైనప్ప‌టి నుంచి పద్మను భర్త చిత్ర హింసలకు గురిచేసేవాడు. వేణుగోపాల్‌ వేధింపులు భరించలేక.. పద‍్మ తన పుట్టింటికి వెళ్లిపోయింది.

 

ఆ త‌రువాత అత్మ మామ‌ల‌ను ఒప్పించి భార్య‌ని త‌న‌తో పాటు ఇంటికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన రోజే శాడిస్ట్‌ భర్త.. పద్మను దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సూట్ కేసులో పెట్టి రేణిగుంట మండల పరిధిలోని వెంకటాపురం పంచాయతీ చేపల చెరువులో పడేశాడు. ఆ త‌రువాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు. జ‌న‌వ‌రి 5 నుంచి ప‌ద్మ భార్య త‌న‌తో ఉన్న‌ట్లు అత్త‌మామ‌ల‌ను న‌మ్మించాడు. ఐదు నెల‌లుగా త‌న కుమార్తెతో మాట్లాడ‌నీయ‌కుండాచేయ‌డంతో ప‌ద్మ త‌ల్లిదండ్రుల‌కు అనుమానం వ‌చ్చి తిరుప‌తి తూర్పు పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

Husband Brutally killed Wife At Tirupati - Sakshi

కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు భర్త వేణుగోపాల్ ను పోలీసులు ర‌ప్పించి విచారించ‌గా తానే హ‌త్య చేసి చెరువులో ప‌డేసిన‌ట్లు తెలిపాడు. చెరువు వ‌ద్ద‌కు వెళ్లిన పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న మృత‌దేహాన్ని బ‌య‌ట‌కు తీయించారు.

Related posts