తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. సదాశివపేట మండం కోనాపూర్లో ఓ కానిస్టేబుల్ యువతిపై పెట్రోల్ పోసి కాల్చి చంపడం కలకలం రేపుతోంది. హత్నూర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న ప్రకాష్ రామచంద్రాపురం పీఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న మందాకిని గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇటీవల పెళ్లి విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మందాకినిని ప్రకాశ్ పెట్రోల్ పోసి కాల్చి చంపాడు. మందాకినిని నమ్మించి తన కారులోనే కోనాపూర్ శివారుకు తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. సోమవారం రాత్రి విధులు నిర్వహించిన తర్వాత ఇంటికి తిరిగి రాకపోవడంతో తమ కుమార్తె కనిపించడంలేదని నిన్న పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ప్రకాశ్ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.