telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

భారీ పేలుడు… 10 మందికిపైగా మృతి !

fire accideent antaarvedi

బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సమీపంలో ఉన్న అబ్బలగెరి హుణసోడు గ్రామంలో గురువారం అర్థరాత్రి భారీ పేలుడు సంభవించింది. అయితే… ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని శివమొగ్గ జిల్లా కలెక్టర్‌ కేబీ శివకుమార్‌ చెప్పారు. వివరాల్లోకి వెళితే…. శివమొగ్గలోని హునసోడు రైల్వేక్రషర్‌ వద్ద గురువారం రాత్రి 11 గంటల సమయంలో పెద్ద పేలుడు శబ్దం వినిపించింది. ఈ ఘటనలో 10 మంది మరణించారని అధికారులు పేర్కొన్నారు. ఈ పేలుడు ధాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. రోడ్డుపై కూడా నెర్రలు ఏర్పడ్డాయి. పేలుడు ఘటనతో భూకంపం వచ్చిందని ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ ప్రమాద ఘటనలో జిలటిన్ స్టిక్కులు తీసుకువస్తున్న ట్రక్కు పేలడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఈ పేలుడులో మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. మృతులను గుర్తించడం కష్టంగా మారింది. జిల్లా అధికారులు, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts