ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో అమానుషం చోటుచేసుకుంది..బీ ఫార్మసీ విద్యార్థిని ప్రియుడు సాదిక్ ఫామ్ హౌస్ ఓ షెడ్ లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండడం కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
శ్రీ సత్య సాయి జిల్లా గోరంట్ల పట్టణానికి చెందిన గోపి, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. గోపీ పుట్టపర్తి పీహెచ్.సీలో సూపర్ వైజర్ గా పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె తేజశ్విని తిరుపతి కృష్ణతేజ ఫార్మసి కళాశాలలో బీఫార్మ్ మూడో సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటోంది.
తేజశ్విని కుటుంబం గతంలో గోరంట్ల పట్టణంలోని ఒకే వీధిలో నివాసం ఉండేది. ఆ సమయంలో అదే వీధికి చెందిన సాధిక్ అనే యువకుడితో తేజస్వినికి పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. కొంతకాలం తర్వాత తేజశ్విని కుటుంబం అక్కడి నుంచి మరోవీధికి మారిపోయింది. అయినా ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఇదిలా ఉండగానే తిరుపతిలోని కాలేజీ హాస్టల్లో ఉంటున్న ఆమె మల్లాపల్లిలోని ఓ ఇటుక ఫ్యాక్టరీకి చెందిన షెడ్డులో శవమై కనిపించింది.
అనుమానాస్పద స్థితిలో ఉరికి వేలాడుతున్నతేజస్వినిని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు. షెడ్డు పైకప్పుకు చున్నితో ఉరివేసుకోగా ఆమె రెండు కాళ్లు మంచంపై ఉన్నాయి. షెడ్డున్న స్థలం తేజస్విని ప్రియుడు సాధిక్ కు చెందినది కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ప్రేమ పేరుతో తేజస్వినికి మాయమాటలు చెప్పి తిరుపతి నుంచి కారులో తీసుకొచ్చి షెడ్డుకు హత్య చేసి, ఆత్మహత్యగా నమ్మిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగల కొట్టి మృతదేహాన్ని బయటికి తీశారు .సంఘటనా స్థలంలో మృతురాలి బ్యాగు, సెల్ పోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండకు తరలించారు.
అయితే యువతి డెడ్బాడీని పోస్ట్మర్టం చేయగా అందులో అత్యాచారం జరగలేదని.. యువతి అత్మహత్య చేసుకుందని వైద్యులు తెలపడంతో. .తమ కూతురిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో మళ్ళీ రీపోస్ట్మర్టం చేస్తున్నారు వైద్యులు. నివేదిక వచ్చిన తరువాత తెలుస్తోంది అత్యాచారం జరిగిందా? హత్య జరిగిందానేది?..తెలియాల్సి ఉంది