*టీడీపీకి సినీ నటి దివ్యవాణి రాజీనామా
*రాజీనామా చేస్తున్నట్టు దివ్యవాణి ట్వీట్..
*మహనాడులో అవమానం జరిగిందంటూ రెండురోజులు క్రితం ఆరోపణ
*టీడీపీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా
తెలుగుదేశం పార్టీకీ రాజీనామా చేస్తున్నట్లుగా ఆ పార్టీ అధికార ప్రతినిధి, సినీ నటి దివ్యవాణి సోషల్ మీడియాలో ప్రకటించారు. .తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకి్స్తూ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు.
ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా చెప్పారు.
మహానాడులోనూ దివ్యవాణి ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలి రోజు కొన్ని కార్యక్రమాలను నిర్వహించారు. అయితే రెండో రోజు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఆమె అవమానం ఫీలయినట్లుగా తెలుస్తోంది. మహానాడు అయిపోయిన తర్వాత ఆమె మాట్లాడిన ఓ వీడియో క్లిప్ వైరల్ అయింది.
అందులో మహానాడులో తనకు అవమానం జరిగిందని… తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయకుండా మహానాడుకు వచ్చానని ..కనీసం మాట్లాడే అవకాశం లేకుండా చేశారని దివ్యవాణి అసంతృప్తి వ్యక్తం చేశారు.
బహుశా నా శవాన్ని ముందుబెట్టి ఓట్లు అడుక్కుంటారేమో అని సంచలన కామెంట్స్ చేశారు. ..ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో కళాకారులకు చోటు లేదు. మురళీమోహన్కు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి కొనసాగుతున్నారు. అధికారం లేని అధికార ప్రతినిధిగా నన్ను మిగిల్చారు.
తాను దేవుని బిడ్డనని.. అవసరం అయితే వైఎస్ఆర్సీపీలో చేరుతానని కూడా చెప్పారు. ఆ వీడియో వైరల్ అయింది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో టీడీపీకి రాజీనామా అంశాన్ని పోస్ట్ చేశారు.
టూరిజం బోట్లలో మంత్రులకు వాటాలు: మాజీ ఎంపీ హర్షకుమార్