telugu navyamedia
ఆంధ్ర వార్తలు

కశ్మీర్‌లో వినిపించే వార్తలు.. కోనసీమలో వినాల్సి రావడం బాధాకరం

కొనసీమ జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్టర్‌లో వరుస పోస్టులు చేశారు

కోనసీమలో వారం రోజులైనా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించక పోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని అన్నారు. ఎక్కడో కశ్మీర్‌లో వినిపించే ‘ఇంటర్నెట్ సేవలు నిలిపివేత’ అనే వార్తను మన సీమలో వినాల్సి రావడం బాధాకరమన్నారు.

ఐటీ వంటి ఉద్యోగాలు ఇవ్వలేని ఈ ప్రభుత్వం… కనీసం వాళ్ళు పని చేసుకునే వెసులుబాటు కూడా లేకుండా చెయ్యడం దారుణమని చంద్రబాబు పేర్కొన్నారు. ఇంటర్ నెట్ అనేది ఇప్పుడు అతి సామాన్యుడి జీవితంలో కూడా భాగం అయ్యిందన్న విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు.

చిరు వ్యాపారుల లావాదేవీలు కూడా నెట్ ఆధారంగా నడిచే రోజుల్లో వారం రోజులు సేవలు నిలిపివేయడం సరికాదన్నారు. వెంటనే కోనసీమలో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇది లక్షల మంది ప్రజలకు సంబంధించిన విషయమని.. ప్రభుత్వ ఉదాసీనత వారికి ఇబ్బందిగా మారకూడదని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Related posts