చత్తీస్గఢ్ ఏజెన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.మావోయిస్టులకు పోలీసులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోలు హతమయ్యారు. చత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో డీఆర్జీ భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు.
ఇరువర్గాల మధ్య సుమారు 40నిమిషాల పాటు కాల్పులు జరుగాయి. ఈ కాల్పుల్లో ద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది నక్సల్స్ తప్పించుకున్నారు. కాల్పుల అనంతరం భధ్రత బలగాలు సంఘటన స్థలంలో ఒక 303రైఫిల్, ఒక 301 బోర్ తుపాకి మావోయిస్టులకు సంబంధించిన ఇతర సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.