ప్రస్తుతం చాలామంది హీరోయిన్లు తమ సినిమాలకు తామే డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా తమకున్న మల్టీ టాలెంట్ ను బయటపెడుతున్నారు. ఇక కొంతమంది హీరోయిన్లు తమ నటనతోనే కాకుండా తమ గానంతోను ప్రేక్షకులని అలరిస్తున్నారు. కొందరు నటీ నటులైతే ప్రొఫెషనల్ వర్క్ అన్నట్టు అసలైన సింగర్స్ గా పాటలు పాడుతున్నారు. తాజాగా గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే గానంతో అలరించేందుకు సిద్దమైందట. ప్రస్తుతం పూజా, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. చిత్రంలో ఓ సాంగ్ని పూజాచే పాడించాలని థమన్ భావిస్తున్నాడట. ఈ క్రమంలో ఆమెకి కొద్ది పాటి ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.
previous post
next post