telugu navyamedia
సినిమా వార్తలు

పూరీ గురించి షాకింగ్ విజయాన్ని బయటపెట్టిన వర్మ

Puri-and-RGV

టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు పూరీ జగన్నాథ్. తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను చేసి బ్లాక్ బస్టర్ హిట్ లను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల సరైన హిట్ లేక డీలా పడిన పూరి తాజాగా “ఇస్మార్ట్ శంకర్” మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పూరి జగన్నాథ్ దర్శకుడిగానే మనకు తెలుసు. కానీ ఆయన ఓ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటించారనే విషయం చెబితే తప్ప ఎవ్వరికీ తెలియదు. పూరీ దర్శకుడు మాత్రమే కాదు నటుడు కూడా అనే షాకింగ్ విషయాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ బయటపెట్టారు. ఆయన తెరకెక్కించిన “శివ” చిత్రం ఎంతగా పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే ఆ చిత్రంలోని “బోటనీ పాటముంది.. మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా…” అనే పాట కూడా చాలా ఫేమస్ అయింది. ఈ పాటకు పూరి స్టెప్పులేశారు. ఈ పాటను ట్విట్టర్‌లో షేర్ చేసిన వర్మ.. “బ్లూ షర్ట్‌లో కనిపించే జూనియర్ ఆర్టిస్ట్ నేటి మేటి దర్శకుడు పూరి జగన్.. హే పూరి జగన్ వాట్ ఏ జర్నీ” అంటూ ట్వీట్ చేశారు. దీనికి పూరి కూడా ‘ఎస్ సార్’ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts