కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. హైదరాబాద్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలి. దీన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా గుర్తించాలన్నారు. ఈ మహమ్మారి కారణంగా వ్యవసాయ ఉత్పత్తి రంగాలు దెబ్బతింటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలన్నారు.
తొలి కరోనా కేసు చైనాలో నమోదయింది. ఒక్కరికి సోకిన కరోనా వందల మందికి అంటింది. ఇప్పుడు 3,76,000 మందికి సోకింది. ఒకరికి వచ్చిన వ్యాధి వందమందికి అంటించుకుంటూ పోతే ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థ కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది’ అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భారత్లో జనాభా ఎక్కువ అదుపు చేయలేకపోతే కోట్లాది మందికి కరోనా సోకే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారని అన్నారు.