telugu navyamedia
క్రీడలు వార్తలు

వరల్డ్ కప్ సెమీస్ లో బ్యాట్ అందుకే తిప్పాను : జడేజా

ప్రస్తుత కామెంటేటర్, మాజీ క్రికెటర్ సంజయ్‌ మంజ్రేకర్‌.. ఓ మ్యాచ్ సందర్భంగా జడేజాను ‘బిట్స్‌ అండ్‌ పీసెస్‌’ లాంటి క్రికెటర్‌ అని కామెంట్ చేశాడు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. జడేజా సైతం అప్పుడే ట్విటర్‌లో ఓ పోస్టు చేసి తనదైన శైలిలో స్పందించాడు. మంజ్రేకర్‌.. నీ నోటి విరేచనాలను ఆపంటూ ఘాటుగా బదులిస్తూ నోరు మూయించాడు. mఅయితే, తాజాగా ఆ ఘటనపై స్పందించిన జడేజా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగిన నాటి సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే మైదానంలో ఉన్న కామెంట్రీ బాక్స్‌ కోసం ఎక్కడుందా అని వెతికాను. అది అక్కడే ఎక్కడో ఉంటుందని భావించాను. ఆ సమయంలో నేను ఎవరికోసం బ్యాట్‌ను తిప్పానో అర్థం చేసుకునే వారికి తెలుస్తుంది.’అని జడేజా చెప్పుకొచ్చాడు. ఇక ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 239/8 పరుగులు చేసి టీమిండియా ముందు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఛేదనలో భారత టాప్‌ ఆర్డర్‌ పేకమేడలా కూలింది. ఆ సమయంలో జడేజా, ధోనీ శతక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను గెలిపించేలా విశ్వప్రయత్నం చేశారు. జడేజా ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. కానీ, చివర్లో అనూహ్యంగా పుంజుకున్న కివీస్‌ వారిద్దర్నీ ఔట్‌ చేసి విజయం ఖాయం చేసుకుంది.

Related posts