telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏటా రూ.8 వేల కోట్లు దుబారా.. వైసీపీ సర్కార్ పై యనమల ధ్వజం

Yanamala tdp

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని ఆర్థిక దుస్థితిలోకి నెడుతున్నారని ఆరోపించారు. వలంటీర్లు, సచివాలయాల ముసుగులో ఏడాదికి రూ.8 వేల కోట్లు దుబారా చేస్తున్నారని మండిపడ్డారు. నాలుగు నెలల్లో తన ఇంటి కోసం రూ.16 కోట్లు ఖర్చు చేసిన పెద్దమనిషి ఒక్క పైసా వృథా చేయొద్దని చెప్పడం హాస్యాస్పదం అని అన్నారు.

సాక్షి ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా పోస్టులు సృష్టించి ప్రభుత్వ జీతాలు చెల్లిస్తున్నారని విమర్శించారు. సాక్షి మీడియా యాడ్ రేట్లను 200 శాతం పెంచారని ఆయన ఆరోపించారు. ఓవైపు రంగులు వేయడం కోసం వందల కోట్లు దుబారా చేస్తూ, మరోవైపు పొదుపుపై నీతి వాక్యాలు చెబుతున్నారని యనమల వ్యాఖ్యానించారు.

Related posts