telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఒకే వేదికగా చంద్రబాబు, పవన్ కలుసుకున్నారు

Pawan-Kalyan-Chandrababu-

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పెళ్లి వేడుకలో ఏపీ సీం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు హైదరాబాద్ లో కలుసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్న ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికగా కలుసుకోవడం విశేషం. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని సరదాగా మాట్లాడుకున్నారు.

వీరిద్దరి కలయికకు రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు మనవరాలి వివాహం వేదికైంది. నేడు రామోజీ మనవరాలు కీర్తి సుహానా, నవయుగ గ్రూప్స్ చైర్మన్ సి. విశ్వేశ్వరరావు మనవడు రాయల వినయ్‌తో నేడు వైభవంగా జరిగింది. ఈ వివాహానికి చంద్రబాబు, పవన్ ఇద్దరూ హాజరయ్యారు. ఇద్దరూ కలుసుకుని సరదాగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.

Related posts