టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై ఏపీ మంత్రి కొడాలి నాని విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అశోక్ బాబు దొంగ సర్టిఫికెట్లతో ప్రమోషన్లు సంపాదించాడని మండిపడ్డారు.
ఇంటర్ చదవి డిగ్రీ చదివినట్లు సర్టిఫికెట్లు పెట్టాడని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఇతరుల ప్రమోషన్లను అశోక్ బాబు కొట్టేశారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అశోక్ బాబుపై ఫిర్యాదు చేసింది వైసీపీ కాదని, అశోక్బాబు అరెస్ట్తో టీడీపీ గగ్గోలు పెడుతోందని మంత్రి మండిపడ్డారు. అశోక్బాబు కేసును లోకాయుక్త సీఐడీకి అప్పగించింది. అశోక్బాబు ఏం తప్పు చేశాడని చంద్రబాబు నిస్సిగ్గుగా అడుగుతున్నారు. అశోక్ బాబు తప్పు చేశాడు కాబట్టే సీఐడీ అరెస్ట్ చేసిందని మంత్రి కొడాలి నాని అన్నారు
అవినీతి పరుడు కోసం టీడీపీ తాపత్రయపడుతోంది. అశోక్బాబైనా.. చంద్రబాబైనా చట్టం ముందు సమానమే.. దొంగలను వెనుకేసుకొస్తున్న ముఠా నాయకుడు చంద్రబాబు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడతామని మంత్రి కొడాలి నాని ప్రకటించారు. ప్రజల ఆమోదంతో మూడు రాజధానులు నిర్మిస్తామన్నారు. గతంలో శాసనమండలిలో తమకు ఉన్న బలంతో ఈ బిల్లులను టీడీపీ నిలిపివేసిందన్నారు. ప్రతిపక్షాలు ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా మూడు రాజధానులు కచ్చితంగా ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
కొత్త జిల్లాల ఏర్పాటుపై రాద్దాంతం చేస్తున్నారని, కొత్త జిల్లాలపై కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారని మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరు పెడితే వ్యతిరేకిస్తారా? అని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. హిందూపురం జిల్లా కేంద్రం కావాలట అని మంత్రి కొడాలి నాని అన్నారు.
సీఎం జగన్ ఫ్యాక్షన్ నేతగా వ్యవహరిస్తున్నారు: గోరంట్ల