telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేశ్ వ్యాఖ్యల పై స్పందించిన మంత్రి అనిల్

Anil kumar jadav minister

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయనీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ వ్యాఖ్యల పై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. 2017, డిసెంబర్ నెలలో టీడీపీ ప్రభుత్వం నెల్లూరులో 120 ఇళ్లను కూల్చివేసిందనీ, 151 కుటుంబాలను రోడ్డున పడేశారని అనిల్ ఆరోపించారు.

రోడ్డున పద్దవారికి పునరావాసం కానీ, నష్టపరిహారం కానీ ఇంతవరకూ అందించలేదని దుయ్యబట్టారు. అలాంటి నిరుపేదలకు వైసీపీ అండగా నిలిచిందని గుర్తుచేశారు. ఏదైనా వార్తాపత్రికల ఆర్టికల్స్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేముందు క్షుణ్ణంగా చదవాలని హితవు పలికారు. ఈ ట్వీట్ కు నారా లోకేశ్ తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబును కూడా మంత్రి అనిల్ ట్యాగ్ చేశారు.

Related posts