telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేయాలి: మంత్రి కేటీఆర్‌

ktr trs president

మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రతిరోజు కమిటీ పార్టీ కార్యాలయం నుంచి పనిచేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. కార్పొరేషన్లలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. గతంలో వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లకు ప్రత్యేక నిధులు ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

కరీంనగర్‌, నిజామాబాద్‌ కార్పొరేషన్లలో బీజేపీ, కాంగ్రెస్‌ల లోపాయికారి కుమ్మక్కుని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కార్పొరేషన్లలో పార్టీ బీ ఫారాలకు భారీ పోటీ నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణపై దృష్టి పెట్టాలన్నారు. సాధ్యమైనన్ని ఎక్కువ ఏకగ్రీవాల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. సోషల్‌ మీడియాలో పార్టీ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. రెబల్‌ అభ్యర్థుల నామినేషన్లు ఉపసంహరించుకునే ప్రక్రియపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. 

Related posts