తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్రెడ్డి పీహెచ్డీ పూర్తి చేశారు. శుక్రవారం జేఎన్టీయూ స్నాతకోత్సవంలో ఆయన తన పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅ తిథిగా డీఆర్డీఓ చైర్మన్ సతీశ్రెడ్డి హాజరయ్యారు. సతీశ్రెడ్డి చేతుల మీదుగా మహేందర్రెడ్డి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆన్లైన్ ద్వారా అధ్యక్ష ఉపన్యాసం చేశారు. అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇంపాక్ట్ ఆఫ్ ఇనర్మేషన్ టెక్నాలజీ ఆన్ పోలిసింగ్’’ అనే సబ్జెక్టు మీద తనకు పీహెచ్డీ రావడం ఆనందంగా ఉందన్నారు. పోలీసింగ్, సమాజ భద్రతలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంపై తాను గత పదేళ్లుగా అధ్యయనం చేస్తున్నానన్నారు. తన పీహెచ్డీ పూర్తి చేయడంలో సహకరించిన గైడ్, ఇతర సభ్యులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. తన పరిశోధన తెలంగాణ పోలీసులకు ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
సీఏఏ చట్టం ఏ ఒక్క భారతీయుడికి వ్యతిరేకం కాదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి