ముస్లింలు, దళితులపైనే క్రూరమైన చట్టాలను ఉపయోగిస్తున్నారని లోక్సభలో హైదరాబాద్ ఎంపీ అసద్దుదీన్ ఓవైసీ మండిపడ్డారు. చట్టవిరుద్ద కార్యక్రమాలకు పాల్పడేవారిపై కఠిన శిక్షను అమలు చేయాలంటూ ప్రవేశపెట్టిన బిల్లుపై ఓవైసీ మాట్లాడారు. యూఏపీఏ బిల్లు.. ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందన్నారు. న్యాయపరమైన హక్కుల్ని ఆ బిల్లు నాశనం చేస్తోందన్నారు.
అంతర్జాతీయ ఒప్పందాల కోసం జాతీయవాదాన్ని అమ్మేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. గతంలో ఇలాంటి కఠినమైన చట్టాలను చేసిన కాంగ్రెస్ పార్టీని కూడా ఓవైసీ తప్పుపట్టారు. ఈ చట్టాల ద్వారా ఒక్క కాంగ్రెస్ నేతనైనా అరెస్టు చేయండి, అప్పుడే వాళ్లకు ఆ చట్టం తెలుస్తుందని ఓవైసీ కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోతిరెడ్డిపాడును జగన్కు కేసీఆర్ గిఫ్ట్గా ఇచ్చారు: రేవంత్రెడ్డి