telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టిఆర్ఎస్ అభ్యర్ధి నోముల‌ భగత్ కు కరోనా పాజిటివ్…

తాగాజా తెలంగాణలో జరిగిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పోలింగ్ రోజున కరోనా వైరస్ వేగంగా విస్తరించినట్టు చెబుతున్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్ ‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే టీఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డి కి కరోనా పాజిటివ్ అని తేలింది. మరో పక్క కాంగ్రెస్, బిజెపి నేతలకు‌ కరోనా  పాజిటివ్ అని అంటున్నారు. ఇక రోజు వారీ కేసులలో కూడా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో భారీగా కరోనా కేసులు పెరిగినట్టు చెబుతున్నారు. పెద్దవూర 59, హాలియా 66, గుర్రంపోడు 11, నిడమనూరు 7 కేసులు నమోదయ్యాయి. త్రిపురారం లో ఈ రోజు కిట్స్ లేక టెస్టులు చేయలేదని అంటున్నారు. ఇక నాగార్జునసాగర్ లో 17 కేసులుగా నమోదు కాగా మొత్తం ఇవాళ 160 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం మీద ఈ అంశం చర్చనీయంశంగా మారింది. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.

Related posts