దేశంలో కరోనా వ్యాప్తికి మూలకేంద్రంగా మారిన ఢిల్లీ నిజాముద్దీన్లోని మర్కజ్లో ప్రార్థనకు హాజరైన వారిని గుర్తించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా మర్కజ్కు వందల సంఖ్యలో హాజరవడంతో నగర వాసులు భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. ఇక నగరం నుంచి మర్కజ్కు వెళ్లొచ్చిన వారి వివరాలను సేకరిస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు.
మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో ఇప్పటికే 80 శాతం మందిని గుర్తించామని చెప్పారు. మిగతా వారు కూడా వైద్య సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నగరంలోని వీధి కుక్కలకు ఎంటమాలజీ విభాగం ద్వారా ఆహారం అందిస్తామని మేయర్ చెప్పారు. అలాగే, 1500 మంది యాచకులకు భోజనం అందిస్తున్నామని తెలిపారు.