telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాజిటివ్ వచ్చిన 140 మందీ ఢిల్లీ వెళ్లొచ్చిన వారే: మంత్రి ఆళ్ల నాని

Alla-Nani minister

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల్లో 140 మందీ ఢిల్లీ వెళ్లొచ్చిన వారేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. సీఎం జగన్ తో సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 161కి చేరిందని తెలిపారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో టెస్టింగ్ ల్యాబ్ ల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారని అన్నారు.

సోమవారం నుంచి విశాఖలో కూడా ల్యాబ్ లో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటికే తిరుపతి, విజయవాడ, కాకినాడ, అనంతపురం ప్రాంతాల్లో ల్యాబ్ లు పనిచేస్తుండగా, కొత్తగా గుంటూరు, కడప ప్రాంతాల్లో కూడా ల్యాబ్ లు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం ఉన్న ల్యాబ్ లలో 500 మందికి టెస్టులు చేయడం వీలవుతుందని చెప్పారు.

Related posts