telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్‌ను పెద్దన్నలా భావించి..సీఎం జగన్ దూసుకెళ్తున్నారు : మంత్రి అనిల్‌

minister anil kumar

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పెద్దన్నలా భావించి ఇరు రాష్ట్రాలకు మేలు చేకూరేలా సీఎం జగన్ దూసుకెళ్తున్నారని ఏపీ మంత్రి అనిల్‌ కుమార్ అన్నారు. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలకు ఇరు రాష్ట్రాల మంత్రులు జగదీష్‌రెడ్డి, అనిల్‌కుమార్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా అనిల్ మీడియాతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలకు మేలు చేకూరేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల నీటి ప్రాజెక్టులన్నీ నిండి సుభిక్షంగా ఉండాలని, రైతాంగాన్ని ఆదుకునే విషయంలో పరస్పర సహకారం తీసుకుంటామని అనిల్ చెప్పారు. నీళ్ల విషయంలో తెలుగు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయని, కేసీఆర్ పొరుగు రాష్ట్రాలను కలుపుకొనిపోతున్నారని తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా 35 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్నామని జగదీష్‌రెడ్డి తెలిపారు.

Related posts