telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం: రాజనర్సింహ

raja narasinha

బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఖండించారు. కాంగ్రెస్‌ని వీడేది లేదని స్పష్టం చేశారు. తాను ఎవరినీ కలవడం లేదని క్లారిటీ ఇచ్చారు. కొంత మంది తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

కొందరు పనిగట్టుకునే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. తాను ఎవరినీ కలవడం లేదని స్పష్టం చేశారు. ఇకపై తనపై చేస్తున్న దుష్ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ప్రజలు గమనించాలని కోరారు.

Related posts