telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అక్బరుద్దీన్ త్వరగా కోలుకోవాలి : వైఎస్‌ జగన్‌

jagan

ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన మజ్లిస్‌ పార్టీ శాసనసభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ లండన్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒవైసీ అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుని ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

ఈమేరకు తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. కాగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఒవైసీ రెగ్యులర్‌ వైద్య సేవల కోసం గత మూడు రోజుల క్రితం అక్బరుద్దీన్‌ తిరిగి ఆకస్మికంగా వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పికి గురికావడంతో కుటుంబ సభ్యులు అక్కడి ఆసుపత్రిలో చేర్పించారు.

Related posts