telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేయనున్న ఆర్సీబీ…

ఈ రోజు అబుదాబి ఐపీఎల్ 2020 లో వేదికగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇక ఇందులో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ కీరన్ పోలార్డ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తే వారు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలోకి వెళ్లడం మాత్రమే కాకుండా ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి జట్టుగా నిలుస్తుంది. ఈ మ్యాచ్ లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఆడుతాడు అనుకున్నారు.. కానీ మళ్ళీ రోహిత్ జట్టులోకి రాకపోవడంతో ముంబైకి పోలార్డ్ న్యాయకత్వం వహిస్తున్నాడు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

ముంబై : ఇషాన్ కిషన్, క్వింటన్ డి కాక్ (w), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ (c), క్రునాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా

బెంగళూరు : దేవదత్ పడిక్కల్, జోష్ ఫిలిప్ (w), విరాట్ కోహ్లీ (c), ఎబి డివిలియర్స్, గుర్కీరత్ సింగ్ మన్, శివం దుబే, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్, డేల్ స్టెయిన్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

Related posts