టీడీపీ నేతలపై వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోన్న చర్యలపై మాజీ మంత్రి, టీడీపీ నేత, దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. ‘ఎన్నికల ముందు ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతికి సాక్ష్యాధారాలున్నాయని తప్పుడు ఆరోపణలు చేసి అధికారంలోకొచ్చారు. చంద్రన్న కానుకలు ఆపారు.
ఈ రోజు మజ్జిగ, నెయ్యి మీద విచారణ అంటున్నారు. ఇది రాజకీయకక్ష సాధింపు కాదా? ఏడాదిలో వైను, మైను, ల్యాండ్, శాండ్ దోపిడీపై సీబీఐ విచారణకిచ్చే దమ్ము, ధైర్యం మీకున్నాయా వైఎస్ జగన్ గారు?’ అని ఆయన ట్వీట్ చేశారు. ధర్మాన్ని, న్యాయాన్ని, చట్టాన్ని నిలబెట్టడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుందంటూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న ప్రజలకు రాసిన లేఖకు సంబంధించిన వార్తలను దేవినేని ఉమ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.