telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ఆ ఏఎస్సై మృతి…

నిజాంపేట్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ప్రమాదానికి గురైన ఏఎస్సై మహిపాల్ రెడ్డి నిన్న అర్ధరాత్రి సమయంలో మృతి చెందారు. కొండాపూర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏఎస్సై మృతి చెందినట్టు తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన కూకట్ పల్లి నిజాంపేట్ లో  రోడ్డు ప్రమాదం ఏఎస్సైకి తీవ్ర గాయాలు అయ్యాయి. నిజానికి ఆరోజున ట్రాఫిక్ పోలీసులు నిజాంపేట్ రాఘవ రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నుంచి తప్పించుకునేందుకు సృజన్ అనే యువకుడు ప్రయత్నించాడు. ట్రాఫిక్ పోలీసులను చూసి వేగంగా వెనక్కు వెళ్లి తన కారులో మరో కారును ఢీ కొట్టాడు సృజన్. మళ్ళీ ముందుకు వచ్చి అక్కడ ఉన్న హోంగార్డు ను సృజన్ తన క్రెటా కార్ తో ఢీ కొట్టాడు. దీంతో హోంగార్డు కు స్వల్ప గాయాలయ్యాయి. సృజన్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ చేయగా 170 రీడింగ్ వచ్చింది. దీంతో సృజన్ పై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి లా అండ్ ఆర్డర్ పోలీసులకు ట్రాఫిక్ పోలీసులు సమాచారం ఇచ్చారు. మొబైల్ పెట్రోలింగ్ వెహికల్ లో స్పాట్ కు వచ్చిన ఏఎస్ఐ మైపాల్ రెడ్డి, ట్రాఫిక్ పోలీసులను విషయం అడిగి తెలుసుకుంటూ ఉండగా ఆయన్ను అస్లాం అనే కార్ డ్రైవర్ ఢీ కొట్టాడు. మైపాల్ రెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది.

Related posts