కారోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అనేక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరోనా ప్రభావం రంజాన్ పండుగపైనా పడింది. రంజాన్ పండుగ సమీపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందస్తుగా పండుగ వేళ ఆంక్షలు విధించింది.
ఇందులో భాగంగా మసీదులకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. నెలరోజుల పాటు ముస్లింలంతా ఉపవాసం ఉండి రంజాన్ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రంజాన్ మాసం సందర్భంగా సామూహిక సమావేశాలు, ప్రార్థనలు, ఇఫ్తార్ విందులు అనుమతించేది లేదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
నీ స్పీడ్ కాంగ్రెస్ లో చెల్లదు ..రేవంత్ కు వీహెచ్ చురకలు