telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అచ్చెన్న రూపాయి కూడా అవినీతి చెయ్యలేదు: నారా లోకేశ్

Nara Lokesh

ఈఎస్‌ఐ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ నేత, ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గురించి దర్యాప్తు లో అధికారులు తెలిపిన విషయాల గురించి టీడీపీ నేత నారా లోకేశ్ స్పందిద్ఞ్చారు. ఈ మేరకు ఓ వార్తా పత్రికలో వచ్చిన వార్తను ఆయన పోస్ట్ చేశారు. ఈ కుంభకోణంలో డీలర్ల నుంచి అచ్చెన్నాయుడికి డబ్బులు చేరినట్లు తమ దర్యాప్తులో ఎక్కడా బయట పడలేదని ఏసీబీ వెల్లడించినట్లు అందులో ఉంది.

ఆర్థికపరమైన లావాదేవీలపై ఆధారాలు లభించలేదని ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ రవికుమార్‌ పేర్కొన్నట్లు అందులో చెప్పారు. తదుపరి విచారణలో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, మొత్తం వ్యవహారాన్ని వెలికితీస్తామని రవికుమార్ చెప్పినట్లు అందులో ఉంది.

రవికుమార్ చెప్పిన విషయాలను లోకేశ్ గుర్తు చేస్తూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అచ్చెన్న రూపాయి అవినీతి చెయ్యలేదని అన్నారు. కేవలం తెలంగాణలో అమలైన విధానాన్ని అధ్యయనం చేసి చెయ్యండి అని లెటర్ రాసినందుకు అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారని చెప్పారు.

Related posts