telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

గుడ్‌ న్యూస్‌ : పండుగ పూట ఏపీలో తగ్గిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే…ఇవాళ మాత్రం కేసులు కాస్త తగ్గాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.52 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 1657 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8 లక్షల 52 వేల 955 కి చేరింది. ఇందులో 19,757 కేసులు యాక్టివ్ గా ఉంటే… 8,26,344 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 07 మంది మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 6, 854 కి చేరింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో జిల్లాల వారీగా తీసుకుంటే అనంతపూర్ లో 80, చిత్తూరులో 184, తూర్పుగోదావరి జిల్లాలో 252, గుంటూరులో 194, కడపలో 71, కృష్ణాలో 225, కర్నూలులో 19, నెల్లూరులో 62, ప్రకాశంలో 86, శ్రీకాకుళంలో 74, విశాఖపట్నంలో 95, విజయనగరంలో 66, పశ్చిమ గోదావరిలో 249 కేసులు నమోదయ్యాయి.

Related posts