మద్యం దొరక్క ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో కేరళ ప్రభుత్వం 2020, మార్చి 30వ తేదీ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ ప్రిస్కిప్సన్ తో మద్యం అందించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు. ఆన్ లైన్ ద్వారా మద్యం విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మరోవైపు మద్యాన్ని మాని వేయాలని అనుకుంటున్న వారికి ఉచితంగానే శస్త్ర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. డీ అడిక్షన్ సెంటర్ లో చేరిపించాలని ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కు కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశాలు జారీ చేశారు.
previous post