telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనాకు వ్యాక్సిన్ రాలేదు.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి: మహమూద్‌ అలీ

Mahmood ali trs

తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ఆయన నిన్న తిరిగి విధుల్లో చేరారు. రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి ఆయన డీజీపీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. అలాగే కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా చూడాలన్నారు. కరోనాపట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని ఆయన పోలీసులకు సూచించారు.

కరోనాకు వ్యాక్సిన్ రాలేదని, రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని, ప్రజలందరూ ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. అందరూ పోషకాహారం తీసుకోవాలని చెప్పారు. తనకు ఆస్తమా కూడా ఉందని, ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ సోకిందని చెప్పారు. అయినప్పటికీ తాను పోషకాహారంతో పాటు అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో కరోనా నుంచి బయట పడినట్లు చెప్పారు.

Related posts