telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ ఫార్మా ప్రమాదంపై హోం మంత్రి ఆరా!

ap minister sucharita on fluds

విశాఖ సాల్వెంట్స్ పరిశ్రమలో గత రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పోలీసులను అడిగి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదంపై రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఇప్పటికే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు.

ప్రాథమిక విచారణ అనంతరం ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో కంపెనీలో పనిచేసే సీనియర్ కెమిస్ట్ నాగేశ్వరరావు (40) మృతి చెందగా మరో నలుగురు గాయపడ్డారు. వీరిలో మల్లేశ్ అనే కార్మికుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Related posts