telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సొంత ఊరిలోనే బాబుకు షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్ళు…

chandrababu tdp ap

ఏపీలో పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత ఊరు నారావారిపల్లెలో తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారు. బాబు నిర్ణయానికి వ్యతిరేకంగా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్దమై టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గంగాధర ప్రచారం చేస్తున్నారు. భీమవరం సెగ్మెంట్ పరిదిలో ప్రచారం చేస్తూ కెమెరా కంటికి చిక్కారు. రెండు రోజుల క్రితం ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఏపీలో పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ను ఇప్పటికే ఎస్ఈ సి రిలీజ్ చేసింది.  ఈనెల 8 న ఎన్నికలు, 10 న ఫలితాలు ఉంటాయి.  అయితే, దీనిని సవాల్ చేస్తూ వివిధ పార్టీలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణ జరగ్గా తీర్పు రిజర్వ్ లో ఉంచారు. అయితే బాబు నిర్ణయాన్ని కొంతమంది టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు.  ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని నేతలు చెప్తుండటంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు.  పరిషత్ ఎన్నికల్లో చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని అన్నారు.  ఒకరిద్దరు నేతలు వ్యతిరేకించినా దీనిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, కుప్పం సహా కొన్ని చోట్ల కొందరికి ఇది నచ్చకపోవచ్చని, అధినేత నిర్ణయాన్ని అందరూ పాటించాలని అన్నారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ఏం జరుగుతుంది అనేది.

Related posts