telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సీబీఐ పిటిషన్‌కు జగన్‌ జవాబు ఇవ్వాలి: యనమల

Yanamala tdp

హైకోర్టులో సీబీఐ పిటిషన్‌కు జగన్‌ జవాబు ఇవ్వాలని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. జగన్‌ రూ.43 వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుదిదశకు చేరిందన్నారు. ట్రయల్స్‌కు హాజరుకాకుండా అందుకే ఎగ్గొడుతున్నారన్నారు. . జగన్‌.. షెల్ కంపెనీల సృష్టికర్త విజయసాయిరెడ్డేనని ఆరోపించారు.

చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌పై ఐటీ దాడులు పార్టీకి సంబంధం లేనివన్నారు. అవి పూర్తిగా శ్రీనివాస్ వ్యక్తిగతమని పేర్కొన్నారు. గత 40 ఏళ్లలో చంద్రబాబు దగ్గర 15 మంది పీఎస్‌లు, పీఏలు పనిచేశారని.. మాజీ పీఎస్‌పై దాడులు జరిగితే పార్టీకి అంటగట్టడం హేయమన్నారు. అక్రమాస్తుల కేసుల నుంచి తప్పించుకోడానికే ఎదుటివాళ్లపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీపై ఫిర్యాదులు చేసేందుకే విజయసాయిరెడ్డికి.. రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని దుయ్యబట్టారు.

Related posts