telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

దేశంలో మైనార్టీల అభివృద్ధికి బీజేపీ సంక్షేమ పథకాలు…

ఈ రోజు కర్నూలు, నంద్యాల బీజేపీ కార్యాలయంలో ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ… క్షేత్ర స్థాయిలో బీజేపీ పార్టీ బలోపేతానికి పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో విస్తృత కార్యక్రమాలు చేపట్టబోతున్నాం అని షేక్ బాజీ తెలిపారు. దేశంలో మైనార్టీల అభివృద్ధికి బీజేపీ పలు సంక్షేమ పథకాలు అమలుజేస్తుంది అని ఆయన అన్నారు. బీజేపీ తీసుకొచ్చిన 370 ఆర్టికల్ రద్దు, ట్రిపుల్ తలాక్ లను ఎంఐఎం పార్టీ వ్యతిరేకిస్తుంది అని చెప్పారు.తనకు 15 నిముషాల సమయమిస్తే దేశంలో ఒక్క హిందువు లేకుండా చేస్తానని అక్బరుద్దీన్ ఒవైసీ హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారు అని షేక్ బాజీ చెప్పుకొచ్చారు. ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఎంఐఎం పార్టీ సొంత అభివృద్ధి పొందుతుంది అని షేక్ బాజీ అన్నారు.

Related posts