డిసెంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
* మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256, పురుషులు 38,89,637, స్త్రీలు 30,76,941, ఇతరులు 415
* మొత్తం వార్డుల సంఖ్య 150, పోటి చేసే అభ్యర్తుల సంఖ్య 1122
* టి.ఆర్.ఎస్ 150, బి.జె.పి 149, కాంగ్రెస్ 146, టి.డి.పి 106, ఎం.ఐ.ఎం 51, సి.పి.ఐ 17, సి.పి.ఎం 12, రిజిస్టార్డ్ పార్టీల అభ్యర్థులు 76, స్వతంత్రులు 415.
* ఫ్లయింగ్ స్క్వాడ్ ల సంఖ్య 60, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ ల సంఖ్య 30
* మొత్తం పోలింగ్ సిబ్బంది 36,404
* పోలింగ్ అధికారులు 9101, సహాయ పోలింగ్ అధికారులు 9101, ఇతర పోలింగ్ సిబ్బంది 18,202
* మొత్తం రిటర్నింగ్ అధికారులు 150, సహాయ రిటర్నింగ్ అధికారులు 150
* సాధారణ పరిశీలకులు 12, వ్యయ పరిశీలకులు 30
* మైక్రో అబ్జర్వర్ లు 1700, వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు 2920
* మొత్తం బ్యాలెట్ బాక్స్ ల సంఖ్య 18,202
* పోస్టల్ బ్యాలెట్ల కై అందిన దరఖాస్తులు 2,629
* ఇప్పటి వరకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది.
* డిసెంబర్ 1న ఉ. 5:30గంటల వరకు ఎన్నికల సిబ్బంది సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో సిద్ధంగా ఉండాలి.
* ఉ. 6గంటలకు పోలింగ్ ఏజెంట్లు హాజరుకావాలి.
* ఉ. 6గంటల నుండి 6:15గంటల మధ్య మాక్ పోలింగ్ జరుగుతుంది.
* ఉ. 6:55 గంటలకు బ్యాలెట్ బాక్స్ లను సీల్ చేయడం జరుగుతుంది.
* ఉ. 7గంటలకు పోలింగ్ ప్రారంభం.
* సా. 6గంటలకు పోలింగ్ పూర్తి అవుతుంది.
* కోవిడ్-19 పాజిటీవ్ ఉండి పోస్టల్ బ్యాలెట్ పొందలేని ఓటర్లకు ప్రత్యేక లైన్ ద్వారా ఓటువేసే అవకాశం.
* ఓటరు గుర్తింపు కార్డులేని ఓటర్లకు ఎంపిక చేసిన 21 ఇతర గుర్తింపు కార్డులు ఉన్నా ఓటింగ్ అవకాశం.
* ప్రతి పోలింగ్ స్టేషన్లో వృద్దులు, వికలాంగులకు ప్రత్యేక క్యూలైన్ల ఏర్పాటు.
* ప్రతి పోలింగ్ స్టేషన్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు.
* మొత్తం 9,101 పోలింగ్ స్టేషన్లలో 1752 హైపర్ సెన్సిటీవ్, 2934 సెన్సిటీవ్, 4415 నార్మల్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.
* జిహెచ్ఎంసి ఎన్నికల్లో 2,909 పోలింగ్ లొకేషన్లు ఉన్నాయి.
* వీటిలో 450 పోలింగ్ లొకేషన్లు హైపర్ సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు గా ఉన్నాయి.
* 921 సెన్సిటీవ్ పోలింగ్ స్టేషన్లు, 1548 పోలింగ్ లొకేషన్లు నార్మల్ గా ఉన్నాయి.
* ఈ ఎన్నికలను సక్రమంగా నిర్వహించేందుకు, శాంతి భద్రతల పరిరక్షణకు 52,500 పోలీసులచే బందోబస్తు.
* జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంతో పాటు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూం ల ఏర్పాటు.
* 150 పోలింగ్ కేంద్రాల్లో ఫేస్ రికగ్నేషన్ సాంకేతిక పరిజ్ఞానం వినియోగం.
* కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రతి పోలింగ్ కేంద్రాన్ని ముందు రోజు శానిటైజేషన్ పూర్తి.