telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

పర్యావరణ పరిరక్షణ కోసం జి హెచ్ ఎం సి లో ప్రతిజ్ఞ

పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేరీ లైఫ్ మేర స్వేచ్ఛ షేహర్ పేరిట పర్యావరణాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేసేవిధంగా జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో సోమవారము ఆయా విభాగాల హెచ్ ఓ డి లు అధికారులు సిబ్బంది అందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు.
పర్యావరణాన్ని రక్షించడానికి సామాజికంగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉంది. నగరము ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా 2028 సంవత్సరానికి రూపాంతరం చెందేదుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.
స్వచ్ఛత దైనందిన జీవనశైలిలో అలవర్చుకున్న అలవాటు వ్యర్థాలు పనికిరాని వస్తువు లు పునర్వినియోగం, రీసైకిల్ చేసుకునే అవకాశం కలదు. (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్,RRR)  మేరీ లైఫ్, మేరా స్వచ్ఛ్ షెహార్  నినాదం తో ముందుకు పోవాలని ప్రతి ఒక్కరూ ఈ చారిత్రాత్మక ఉద్యమం లో భాగస్వామ్యులు కావాలన్నారు ఈ నేపథ్యంలో ప్రజలు తమ ఉపయోగించని వస్తువులు, పాత పుస్తకాలు, బట్టలు, బొమ్మలు మొదలైనవాటిని స్వచ్ఛందంగా నగరం లో ఏర్పాటు చేసిన త్రిబుల్. R కేంద్రాల్లో ఇవ్వవచ్చు. ఈ వస్తువులు తిరగి పునర్నిర్మించి పునర్వినియోగం ఉపయోగించడం జరుగుతుంది.
ఈ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ వి కృష్ణ, జయరాజ్ కెన్నెడీ, సిసిపీ దేవేందర్ రెడ్డి అడిషనల్ సి సి పీ శ్రీనివాస్ రావు సి ఏం అండ్ హెచ్ ఓ డాక్టర్ పద్మజ, సి పీ అర్ ఓ మొహమ్మద్ ముర్థుజా అకౌంట్ చీఫ్ ఎగ్జామినర్ వెంకటేశ్వర రెడ్డి జాయింట్ కమిషనర్ లు ఉమ ప్రకాష్, వెంకట్ రెడ్డి శశికళ, యస్ బి ఏమ్ భారత్, ఆయా విభాగాల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
తదనంతరం అందరూ కలిసి పర్యావరణ పరిరక్షణ కు స్లోగన్ ల తో ర్యాలీ నీ నిర్వహించారు.

Related posts