telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మంత్రి తలసాని పై కేసు నమోదు 

Minister Talasani Fire to Chandrababu
తెలంగాణ  మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ కుమారుడు సాయికిరణ్ యాదవ్ టీఆర్ఎస్  సికింద్రాబాద్‌ లోక్‌ సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ సికింద్రాబాద్‌లోని రెజిమెంటల్‌ బజార్‌ పరిధిలో తెలంగాణ క్రిస్టియన్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఈ సభకు వచ్చిన వారికి తమకు ఓటేయాల్సిందిగా సభికులను వీరిద్దరూ కోరినట్లు తెలుస్తోంది. ప్రార్థనల కోసం అనుమతి తీసుకుని ఎన్నికల ప్రచారం చేయడం పై  ఫ్లయింగ్ స్వ్కాడ్ ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయికిరణ్ యాదవ్, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, కార్పోరేటర్ ఆకుల రూప, క్రిస్టియన్ కౌన్సిల్ బిషప్ గొల్లపల్లి జాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Related posts