telugu navyamedia
క్రీడలు వార్తలు

సీఎస్కే ఆఫర్ వదులుకున్న ఇద్దరు బౌలర్లు…

ఐపీఎల్ 2021 నుంచి ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ తప్పుకున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో 20 ప్రపంచకప్‌, యాషెస్ సిరీస్ ఉండడంతో బయో బబుల్‌లో ఉండడం ఇష్టం లేక.. ఫ్యామిలీతో సమయం గడపాలనే తాను ఐపీఎల్‌ ఆడడం లేదంటూ హాజిల్‌వుడ్‌ స్పష్టం చేశాడు. దీంతో హాజిల్‌వుడ్‌ స్థానంలో ఎవరిని తీసుకోవాలదాని పై అతను ప్రాతినిధ్యం వహించే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తర్జనభర్జన పడుతోంది. అయితే ఆసీస్‌ పేసర్‌ బిల్లీ స్టాన్‌లేక్‌తో పాటు ఇంగ్లండ్‌ బౌలర్‌ రీస్‌ టోప్లీ పేర్లను సీఎస్‌కే పరిగణలోకి తీసుకొని వారి వద్ద విషయాన్ని ప్రస్తావించింది. కానీ సీఎస్‌కే ఇచ్చిన ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం తెసులుస్తోంది. తాము సీఎస్‌కేకు ఆడలేమని, అసలు ఐపీఎల్‌ 2021లో కూడా పాల్గొనే అవకాశం లేదంటూ స్పష్టం చేశారట. భారత్‌లో ఇటీవల కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయని, ఒకవేళ ఐపీఎల్‌లో ఆడేందుకు వచ్చినా బయోబబుల్‌ ఉంటూ మ్యాచ్‌లు ఆడాల్సి వస్తుందన్నారు. అందుకే సీఎస్‌కే ఇచ్చిన ఆఫర్‌ను తాము తిరస్కరించినట్లు ఈ ఇద్దరు పేర్కొన్నారట.

Related posts