ఎస్టీల జాబితానుంచి లంబాడాలను ఒక్క సంతకంతో తొలగిస్తామన్న బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఆ పని ఎందుకు చేయలేదని ఆదిలాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న నిలదీశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ సోయం బాపురావు మాట తప్పారనిఅన్నారు.
లంబాడాలను ఎస్టీ జాబితానుంచి తొలగిస్తామని రాష్ట్ర బీజేపీ నేతలతో చెప్పిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అని సవాల్ విసిరారు.అవినీతికి ఎవరు పాల్పడ్డారో తేల్చుకునేందుకు చర్చకు సిద్ధమని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. ఆదివాసీల ఉద్యమానికి వ్యతిరేకంగా తాను ఎప్పుడూ మాట్లాడలేదని ఆయన పేర్కొన్నారు.